Sunday, April 28, 2024

ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యత ఎస్‌హెచ్‌జిలకు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ బుధవారం జివొను జారీ చేసింది. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేయాలని అందులో పేర్కొంది. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అమలు చేయడం, పర్యవేక్షించడం, బలోపేతం చేయడం, నిర్వహణ, విద్యార్థులకు పాఠశాలల యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం వంటివి అందించడంతో పాటు అన్ని ప్రభుత్వ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తాయి.

అమ్మ ఆదర్శ కమిటీల బాధ్యతలు ఇవీ…
ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం, చిన్న, పెద్ద మరమ్మతు పనులను చేపట్టడం, ఇప్పటికే ఉన్న, పనిచేయని టాయిలెట్ల పునరుద్ధరణ, నిర్వహణ, తరగతి గదుల విద్యుద్దీకరణ, స్కూలు ఆవరణలో పరిశుభ్రతగా ఉండేలా చూడడం, విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, స్కూలు భవనం మొత్తం నిర్వహణ, విద్యార్థులకు యూనిఫారాలు కుట్టించడం వంటివి ఉంటాయి. అమ్మ ఆదర్శ పాటశాల కమిటీలు ప్రతి స్కూలు స్థాయిలో మహిళ ఎస్‌హెచ్‌జీ సభ్యుల నుంచి ఏర్పాటు చేస్తారు. గ్రామ సంస్థ లేదా ఏరియా స్థాయి సమాఖ్య ప్రెసిడెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు స్కూలు హెడ్ మాస్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలను కో ఆర్డినేట్ చేస్తారు. ఇలా ఇకపై గవర్నమెంట్ స్కూల్స్ నిర్వహణ బాధ్యత మొత్తం మహిళ స్వయం సహాయక సంఘాలదే కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News