Saturday, July 27, 2024

దేశ ధాన్యాగారంగా మారిన తెలంగాణ

- Advertisement -
- Advertisement -

2.7కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి
రైతు సంక్షేమానికే పెద్దపీట వేసిన సిఎం కేసీఆర్
దశాబ్ద కాలంలోపే 2.20 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం
ప్రాజెక్టులపైన రూ.1.59 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం
మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధితో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పడు దేశానికే ధాన్యాగారంగా నిలిచింది.ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలనను కొత్తపుంతలు తొక్కించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ , ధాన్యం కొనుగోలు, రైతుబంధు , రైతు భీమా, పంటరుణాల మాఫీ లాంటి పథకాల అమలుతో రైతులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తొంది. తెలంగాణ ఏర్పాటుతో రైతుల కడగండ్లు తీరాయి. ఒకనాటి బంజరు ,పడావు భూములు , నేడు జవసత్వాలు నింపుకుని పచ్చని పంటలతో కళ కళళలాడు తున్నాయి. ఉద్యమ నేత, స్వయంగా రైతు అయిన కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైనది.

ఉమ్మడి పాలనలో జరిగిన వివక్ష, తెలంగాణ రైతుల ఇబ్బందులపై ఉన్న అవగాహనతో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే వ్యవసాయ రంగం పునరుజ్జీవనం కు సాగునీటి వసతి కల్పించడమే ఏకైక పరిష్కారం అని విశ్వసించి తెలంగాణకు కేటాయించబడిన గోదావరి, కృష్ణా జలాల ను పూర్తిగా వినియోగించుట కు అసంపూర్తిగా వదిలివేసిన ఎస్ ఆర్ ఎస్ పి వరద కాలువ లాంటి ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం , పాలమూరు- రంగారెడ్డి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 9 సంవత్సరాల్లో రూ.1.59 లక్షలు కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు కాలంలో పూర్తి చేసిo ది. మిషన్ కాకతీయ కింద రూ .5249 కోట్లను ఖర్చు చేసి కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులనుసైతం పునరుద్ధరించినది.

ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధతో 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా సిఎం కేసిఆర్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం చూపుతూ వచ్చిన ప్రత్యేక శ్రద్దతో 2022-23 నాటికి అది 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు చేరుకుంది. అదేవిధంగా 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 2.70 కోట్ల టన్నులకు చేరుకున్నది. ‘ 2014-15 లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా, 2020-21 నాటికి (44.70 % వృద్ధి) 18.70 లక్షల ఎకరాలు పెరిగి ఇది 60.53 లక్షల ఎకరాలకు చేరుకున్నది. ‘ 2014-15 లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు మాత్రమే కాగా, 2020-21 నాటికి పత్తి దిగుబడి ఏకంగా 63.97 లక్షల బేళ్లకు చేరుకున్నది. ‘ పండించిన ధాన్యం మొత్తాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ. 1 లక్షా 33 వేల కోట్ల ను భరించి రైతుల నుంచి 722.92 లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది.అదే విధంగా ధాన్యం కాకుండా రూ.11,437.55 కోట్లతో ఇతర పంటల ను కొనుగోలు చేసింది. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ప్రభుత్వం 27.49 లక్షల వ్యవసాయ కనెక్షన్లు కు ఉచిత సరఫరా చేస్తున్న ది. అందుకు అనుగుణంగా రూ.32,700 కోట్లు వెచ్చించి విద్యుత్ మౌళిక సదుపాయాలు విస్తరించింది.

ఉచిత విద్యుత్ సరఫరా కు సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తున్నది. వడ్డీ వ్యాపారులు కభంద హస్తాల నుంచి రైతులను కాపాడుటకు రైతు బంధు పథకం ను అమలు చేస్తున్నది.రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పు నగత 10 విడతలలో రూ.65 వేల 190 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసింది.11 వ విడతగా ఈ వానాకాలంలో ఇప్పటివరకు 64.49 లక్షల రైతులకు సంబంధించిన 117.08 లక్షల ఎకరాలకు, రూ.5854.16 కోట్లు ను సాయం గా అందించింది. రైతులకు అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించుటకు రైతు రుణ మాఫీని ప్రభుత్వం అమలచేస్తున్నది. ఇప్పటి వరకు రెండు విడతలలో రూ.17,351.47 కోట్లు రుణమాఫీ చేసింది. రూ 1 లక్ష వరకు రుణ మాఫీ చేయుటకు అనుగుణంగా ప్రభుత్వం ఇటీవల నే రూ 18 వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. రైతు కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు బీమా అమలు చేస్తున్నది. రైతు బీమా కింద 1,08,051 మంది రైతు కుటుంబా లకు
రూ.5402’55 కోట్ల భీమా పరిహారం చెల్లింది.
పెరిగిన జీవన ప్రమాణాలు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల అమల వల్ల వ్యవసాయ రంగం పునరుజ్జీవనం తో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి.
రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15నాటికి రూ.1,12,162 ఉంటే, 2022-23 నాటికి (అంచనా):రూ.3,17,115- కు పెరిగింది. ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ. 572 కోట్లు వ్యయం చేసి ప్రభుత్వం రాష్ట్రంలో 2601 రైతు వేదికల నిర్మించింది. సీజన్ కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తోంది. దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50శాతం తెలంగాణాలోనే ఉత్పత్తి అవుతున్నాయి.ఇప్పటివరకు రూ. 928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాళ్ల రాయితీపై వివిధ రకాల పంటల విత్తనాలు సరఫరా చేసింది. పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది.

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం రూ.963.26 కోట్లను వెచ్చించి 6.66 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చింది.వ్యవసాయ ట్రాక్టర్లు 2014-15నాటికి 94,537 ఉంటే, ప్రస్తుతం వీటి సంఖ్య 3.52 లక్షలకు పెరిగింది.హార్వేస్టర్ల సంఖ్య కూడా 6,318 నుంచి ప్రస్తుతం 19,309 లకు చేరింది.తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు ,రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్దు చేసింది. గోడౌన్ ల సామర్థ్యం -2014-15నాటికి 39.01 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, ప్రస్తుతం ఇది73.82 లక్షల మెట్రిక్ టన్నుల కు పెరిగింది. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేస్తొంది.‘ సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి మార్కెట్ రీసర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసింది. సూక్ష్మ సేద్యం ద్వారా రూ.2186.14 కోట్ల సబ్సిడీతో 3.10లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చింది.రూ. 291.66 కోట్ల సబ్సిడితో 1324 ఎకరాలలో, 1190 రైతుల పాలీ హౌజ్ ల అభివృద్ధి చేసింది.పంట నష్ట పరిహారం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1490.15 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ గా చెల్లించింది.పంటల భీమాలో రాష్ట్ర వాటాగా రూ. 909.55 కోట్లు (2014-15 నుండి 2019-ల20 వరకు) భరించింది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుకై కృషి చేస్తున్నది. 2022-23 లోనే 82,372 ఎకరాలలో నూతనంగా ఆయిల్ పామ్ సాగు చేశారు.సాగు నీటి శిస్తు ను ప్రభుత్వం రద్దు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News