మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూపు–1 నియామకాలపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వచ్చే జూన్ 11వ తేదీ వరకు గ్రూపు–1 నియామకాలపై స్టే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గ్రూపు–1 పరీక్ష ల్లో అవక తవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యో గ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పేర్కొం టూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వి చారణ జరిపిన హైకోర్టు నియా మకాలపై స్టే విధిం చింది. తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రా లు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. శుక్రవారం పిటిషనర్ల తరపున న్యాయ వాది రచనారెడ్డి, టిజి పిఎస్సి తరపున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు. రీకౌంటింగ్లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని రచనారెడ్డి కోర్టుకు తెల పడంతో ఆ అభ్యర్థి జవాబు పత్రాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
తదుపరి విచారణలో సమర్పి స్తామని టిజిపిఎస్సి తరపు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు తెలిపారు. వెకేషన్లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టిజిపి ఎస్సి కోర్టుకు వెల్లడిం చింది. కాగా, విచారణను వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వరరరావు పేర్కొన్నారు. వేలాది మందికి సంబంధించిన విషయం గనుక తొందరపడొద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయొద్దని టిజిపిఎస్సికి సూచించారు. అనం తరం విచారణను జూన్ 11కు వాయిదా వేశారు. గ్రూప్1 పిటీషన్పై విచారణను జూన్ 11వ తేదీన చేపట్టి తర్వాత తీర్పు చెప్పనుంది. అప్పటి వరకూ స్టే కొనసాగ నుండటంతో నియామకాలు నిలిచిపోయాయి. గ్రూప్1 నియామకాలపై స్టేను ఎత్తివేయాలని టిజిపిఎస్సి హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటీషన్పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటీషన్ వేయడంతో హైకోర్టులో తిరిగి స్టేను కొనసాగించాలని నిర్ణయించింది. మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులో నిబంధనలు అనుసరించలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించ డంతో డివిజనల్ బెంచ్ స్టే విధించింది.