Friday, May 3, 2024

106 మంది ఉద్యోగులకు బిగ్ రిలీఫ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే విధించింది. మెదక్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని, 106 మంది సెర్ప్ ఉద్యోగులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే దీనిపై సస్పెండైన ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. సెర్ప్ ఉద్యోగులను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని ఉద్యోగుల తరఫు న్యాయవాది ధర్మాసనానికి వెల్లడించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమభవన్‌లో సెర్ప్,

ఉపాధి హామీ ఉద్యోగులతో మెదక్ లోక్‌సభ బిఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవీందర్‌రెడ్డి, మరికొందరు నేతలు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులపై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. భేటీలో పాల్గొన్న ఉద్యోగులను సిసిటివి ఆధారంగా గుర్తించారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు కాగా 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News