Saturday, May 4, 2024

కొత్తగా 236 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 236 new corona cases 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 236 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,715 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…236 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,95,055కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 122 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,89,918 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.23 శాతంగా నమోదైంది. మరో 305 మంది ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 180 కొవిడ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి.

Telangana Reports 236 new corona cases 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News