Saturday, April 20, 2024

సిసిఎల్ విజేతగా తెలుగు వారియర్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) 2023లో ఘన విజయం సాధించిన తెలుగు వారియర్స్. భోజ్ పురి దబాంగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. కెప్టెన్ అఖిల్ అక్కినేని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భోజ్ పురి తొలి ఇన్నింగ్స్ లో 06 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన వారియర్స్ తొలి ఇన్నింగ్స్ లో 04 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో భోజ్ పురి 06 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. 58 పరుగుల లక్ష్య ఛేదనలో తెలుగు వారియర్స్ ఒక వికెట్ మత్రమే కోల్పోయి విజయం సాధించడమే కాకుండా సిసిఎల్ టోర్నీలో నాలుగో టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News