Monday, May 19, 2025

ఆపరేషన్ కగార్‌కు తాత్కాలిక బ్రేక్

- Advertisement -
- Advertisement -

కర్రెగుట్టల నుంచి కేంద్ర బలగాలు
వెనక్కి ఇండోపాక్ ఘర్షణల
నేపథ్యంలో ఐదువేల మందిని
బార్డర్‌కు పంపిన కేంద్రం
ఇప్పటికే హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్
ఊపిరి పీల్చుకున్న ఏజెన్సీ
గ్రామాలు భారత్, పాక్ కాల్పుల
విరమణతో డైలమా మళ్లీ
భయం నీడలోకి ఏజెన్సీ పల్లెలు
మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్ర భుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌కు తా త్కాలిక బ్రేక్ పడింది. ఇండియా-=పాకిస్థాన్ దే శాల మధ్య నెలకొన్న యుద్ధ ప్రభావం ఆపరేష న్ కగార్‌పై పడింది. తెలంగాణఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల నిర్మూలన కోసం పనిచేస్తున్న సిఆర్‌పిఎఫ్ బలగాలను వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది. దాయాది పాకిస్థాన్ తో జరుగుతున్న యుద్ధంతో ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొనేలా సిఆర్‌పిఎఫ్ కోబ్రా జవాన్లు 24 గంటల్లోగా హెడ్ క్వార్టర్స్‌ను వీడి రావాలని సూచించింది. దీంతో 5 వేల మంది బలగాలు బార్డర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌కు కొంత బ్రేక్ రావడంతో తెలంగాణచత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఏ జెన్సీ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత 20 రోజులుగా తెలంగాణచత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో తిష్టవేసిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం పెద్దఎత్తున కూం బింగ్ చేపట్టాయి.

ఈ కూంబింగ్‌తో కర్రెగుట్టల పరిసర ప్రాంతాల్లోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ వల్ల క గార్‌కు బ్రేక్ రావడంతో కొంత ఉపశమనం ల భించిందని భావించినా రెండు దేశాల కాల్పుల విరమణతో మళ్లీ మొదటికి వస్తుందనే భయం వారిని వెంటాడుతున్నది. నాలుగుచోట్ల నుంచి 5 వేల మందికర్రెగుట్టల్లో కూంబింగ్ చేపట్టిన 20వేల మందిలో కేంద్రానికి సంబంధించిన సిఆర్‌పిఎఫ్ బలగాల్లో  5 వేల మందికి ఆపరేషన్ సింధూర్ కోసం రిలీవ్ కావాలని కేంద్రం ఆదేశించింది. వీరంతా ములుగు జిల్లాలోని వెంకటాపురం, అలుబాక, వీరభద్రవరం, పెద్దగుట్ట పరిసరాల్లో గత 20 రోజులుగా కూంబింగ్‌లో పాల్గొంటున్నారు.. వీరిని తమ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.

దీంతో బలగాలు రిపోర్ట్ చేసి ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొనేందుకు రెడీ అయ్యాయి. ఆదివారంలోగా భారత్ పాక్ బార్డర్‌కు వెళ్లేందుకు సిద్ధమవగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణతో బలగాల కదలికలపై సస్పెన్స్ నెలకొంది. కేంద్ర బలగాలు రిలీవ్ అయినప్పటికీ ఆపరేషన్ కగార్‌లో చత్తీస్‌గఢ్ వైపు డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్, బస్టర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.’

మావోల ప్రకటన…
బలగాల వెనక్కితో…ఆరు నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటన చేయడం, మరోవైపు కేంద్ర బలగాలు వెనక్కి పోతుండటంతో కొంత ఊపిరి పీల్చుకున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలకు గంటల వ్యవధిలోనే మళ్లీ భయం ఆవరించింది. ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తో కేంద్ర బలగాలు మళ్లీ వెనక్కి వచ్చి ఆపరేషన్ కగార్‌లో పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు. కగార్‌లో భాగంగా చేపడుతున్న కూంబింగ్‌లతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పెరిగిన లొంగుబాట్లు…కర్రెగుట్టల్లో గడిచిన 20 రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్‌తో లొంగుబాట్లు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట పదుల సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్నాయి. వీరంతా కూడా తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News