Sunday, April 28, 2024

ఢిల్లీ లక్ష్యంగా ఉగ్రదాడులకు పాక్ మూకల కుట్రలు ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న సైనిక స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు పాక్‌కు చెందిన లష్కరే తొయిబా , జైషే మమమ్మద్ కుట్రలు పన్నినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా ఢిల్లీనే లక్షంగా ఈ ఉగ్రసంస్థలు దాడులకు ప్రయత్నించవచ్చని చెబుతున్నాయి. దీంతో ఢిల్లీ లోని భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. దేశం లోని కొన్ని ఉగ్రసంస్థలు కూడా దాడులకు పాల్పడే అవకాశాలను కొట్టి పారేయలేమని ఏజెన్సీలు చెబుతున్నాయి.

ఢిల్లీ, దాని చుట్టుపక్కల పలు పర్యాటక ప్రాంతాలు , ఇతర ప్రదేశాలను లక్షంగా చేసుకొని కొన్ని సంస్థలు పనిచేస్తున్నట్టు ఫిబ్రవరిలో తొలిసారి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. మే నెలలో పాక్ లోని లష్కరే ఆపరేటివ్ ఒకరు, ఢిల్లీ లోని కీలక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించమని ఇక్కడి ఉన్న అతడి సహచరులకు సూచించిన విషయాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. వీటిల్లో కొన్ని కీలక మార్గాలు రైల్వే స్టేషన్లు, ఢిల్లీ పోలీస్ కార్యాలయాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రధాన కార్యాలయం ఉన్నాయి. భారత్ లోని ఢిల్లీ సహా పలు నగరాల్లో జైషే సంస్థ దాడులు చేస్తుందని ఈ ఏడాది మేలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ వేర్పాటువాది ప్రకటించాడు.

ఇక అంతర్గత వామపక్ష తీవ్ర వాదులు , సిక్కు మిలిటెంట్ సంస్థలు , ఈశాన్య భారత్ లోని వేర్పాటు వాద సంస్థల నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఢిల్లీ పోలీస్‌లు దాదాపు 10,000 మంది సిబ్బందితో నగర వ్యాప్తంగా భద్రతా చర్యలను చేపట్టారు. దాదాపు 1,000 ఫేషియల్ రికగ్నైషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ వ్యవస్థలను కీలక ప్రదేశాల్లో మోహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News