Saturday, June 28, 2025

కొత్త తరహా సినిమాటిక్ అనుభవం కోసం…‘తమ్ముడు’కు ‘ఎ’ సర్టిఫికెట్

- Advertisement -
- Advertisement -

‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ తమ్ముడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు ‘ఎ’ సర్టిఫికెట్ ఎంచుకున్నారు. కట్స్‌తో ఈ సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించేది. అయితే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ‘ఎ’ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇటీవల ‘తమ్ముడు‘ మూవీ కోసం చేసిన ఇంటర్వ్యూస్ లో దిల్ రాజు ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో స్పష్టంగా చెప్పారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి పూర్తి ఎంటర్ టైనర్స్ లేదా సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ‘తమ్ముడు‘ సినిమాకు ఒక కొత్త తరహా సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు కట్స్ లేకుండా ’ఎ’ సర్టిఫికెట్ తీసుకునేందుకే దిల్ రాజు మొగ్గుచూపారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ‘తమ్ముడు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News