Saturday, July 27, 2024

ఉద్యోగాల పేరిట లక్షలు కాజేశాడు.. చివరికి చిక్కాడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమయాకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన మహేష్ ను హైదరాబాద్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 16 కేసుల్లో మహేశ్ నిందితుడిగా ఉన్నాడు. యూసఫ్ గూడకు చెందిన బాధితుడి ఫిర్యాదుతో మహేష్ పై కేసు నమోదు చేశారు. బాధితుడు, అతని స్నేహితుల నుంచి రూ. 46.19 లక్షలు కాజేసాడు నిందితుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News