Saturday, July 27, 2024

కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి

- Advertisement -
- Advertisement -

మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి
మార్చి 17 తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నది
హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను నిలదీయాలి
బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి చెప్పాలని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా, తెలంగాణ సమస్యలు డిల్లీ వేదికగా ప్రశ్నించేందుకు, పరిష్కరించేందుకు బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులు గెలవాలని అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులు, ఆయా జిల్లాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో వేర్వేరుగా సమావేశం. పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు.

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ, రాజీ పడకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బిఆర్‌ఎస్‌తోనే సాధ్యం అవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. కాంగ్రెస్ మోసాలపై నిలదీయాలని, ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని అన్నారు.అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని పేర్కొన్నారు. రెండు మూడు హామీలు అసంపూర్తిగా అమలు చేసి అన్ని చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రుణమాఫీ చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. కరెంట్ రాకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పొలాలకు నీరు అందక ట్యాంకర్లతో నీళ్ళు అందించే కాలం వచ్చిందని అన్నారు. కాలిపోయే మోటార్లు, పెలిపోయే ట్రాన్స్‌ఫార్మర్ల దుస్థితిని కాంగ్రెస్ మళ్ళీ తెచ్చిందని మండిపడ్డారు. అర్హులు అంటూ గ్యాస్ సబ్సిడీ 30 శాతం శాతం మందికే ఇస్తూ, మిగతా 70 శాతం వారికి మొండి చేయి చూపుతున్నారని అన్నారు. ఇలాంటి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు ఇంటింటికీ వెళ్లి చెప్పాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.

అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీసే రోజులు ముందున్నాయి
మార్చి 17 తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నదని, హామీలు అమలు చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్‌ను నిలదీయాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. వానాకాలం వడ్లు బోనస్ ఇచ్చి కొనలేదని, వచ్చే యాసంగి పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని నిలదీయాలని చెప్పారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే అనునిత్యం నిలదీసే బిఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. వాస్తవాలను ఎప్పటికపుడు అన్ని వర్గాల ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమయ్యిందని, అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీసే రోజులు ముందున్నాయని చెప్పారు. పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్ధేశం చేశారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.

Harish Rao 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News