Saturday, April 27, 2024

ఎన్నికల కమిషన్ తొలి వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకు సమా న అవకాశాలు కల్పించేందుకు తీసుకునే చర్యలలో భాగంగా గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హోం కార్యదర్శులను తొలగించాలని, ఎన్నికల కమిషన్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కూడా తొలగించాలని ఇసి ఆదేశించింది. అంతేగాక మిజోరం, హిమాచల్‌ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా శాఖల(జిఎడి)కు చెందిన కార్యదర్శుల ను కూడా తొలగిస్తూ ఉదేశాలు ఇసి ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 16న లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సిఇసి రాజీవ్ కుమార్ బృమన్‌ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్‌సింగ్‌ఛాహల్, అదనపు కమిషనర్లు, డి ప్యూటీ కమిషనర్లను కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న లేదా తమ సొంత జిల్లాలలో పనిచేస్తున్న ఎన్నికల సంబంధిత విధులను నిర్వర్తిస్తున్న అధికారులందరినీ బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కమిషన్ ఆదేశించింది. కొన్ని మున్సిపల్ కమిషనర్లు, కొందరు అదనపు, డిప్యుటీ మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేయలేదు. దీనిపై ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు సం బంధించిన కమిషనర్, అదనపు, డిప్యుటీ కమిషనర్లను వెం టనే బదిలీ చేయాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన కమిషనర్లు, అదనపు, డిప్యూ టీ కమిషనర్లను కూడా ఇదే ప్రకారం బదిలీచేయాలని చీఫ్ సెక్ర టరీని ఇసి ఆదేశించింది. సోమవారం నాడిక్కడ సమావేశమైన సిఇసి రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కు మార్, సుఖ్‌బీర్‌సింగ్ సంధు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
బెంగాల్ కొత్త డిజిపిగా సహాయ్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ కొత్త డిజిపిగా వివేక్ సహాయ్ నియమితులు అయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం సంబంధిత నియామక ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న డిజిపి రాజీవ్‌కుమార్‌ను ఎన్నికల సంఘం బా ధ్యతల నుంచి తప్పించింది. ఈ పరిణామం జరిగిన కొద్ది గంటలకే నూతన డిజిపి నియామకం జరిగింది. ఇప్పు డు కొత్త డిజిపి అయిన సహాయ్ హోం గార్డ్ డైరెక్టర్ జనరల్, కమాండెంట్ జనరల్‌గా ఉన్నారు. ఆయన 1988 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ఇప్పుడు డిజిపి పదవి నుంచి వైదొలుగుతున్న రాజీవ్‌కుమార్‌ను ఐటి విభాగానికి బదిలీచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News