Sunday, April 28, 2024

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

హనుమకొండ టౌన్ : ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావుకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు మాట్లాడుతూ గర్భిణిలు, బాలింతలు, పసి పిల్లల సంరక్షణతో పాటు ఆసుపత్రిలో కాన్పులు చేయించడం, కుటుంబ నియంత్రణ, టీబీ, మలేరియా, ఫైలేరియా, లెప్రసీ, బోదకాలు వంటి వ్యాధులకు కూడా అందుబాటులో ఉండి నిరంతరం సేవలు అందిస్తున్నామని చెప్పారు.

తమ పనికి సమాన వేతనం అందించాలని కోరారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నామని చెప్పారు. గతంలో ఆశావర్కర్ల వేతనం రూ.9750లు అని ప్రభుత్వం చెప్పిందని, కాని జిల్లాలో అధికారుల వేతన కోత, టార్గెట్ పనులతో ప్రజలకు ఆరోగ్య సూత్రాలు చెబుతూ పని ఒత్తిడితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మైముద, పద్మ, శ్రీలత, రశీదా, యాదమ్మ, శారద, అనిత, సుశీల, సాల్మా, సునీత, రాజశ్రీ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News