Tuesday, April 30, 2024

హైదరాబాద్ లో 8వ స్టోర్ ను ప్రారంభించిన ది స్లీప్ కంపెనీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ కంఫర్ట్-టెక్ బ్రాండ్ ది స్లీప్ కంపెనీ, భారతదేశంలో తమ 75వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన స్టోర్ నగరంలో కంపెనీ 8వ అవుట్‌లెట్‌గా నిలిచింది , మంచి నాణ్యమైన నిద్ర పరిష్కారాల కోసం నగరవాసుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను ఇవి తీర్చనున్నాయి. ఒకసారి ఈ అవుట్‌లెట్‌లోకి వినియోగదారులు అడుగుపెడితే, విస్తృతమైన రీతిలో ఉత్పత్తి శ్రేణిని వారు అన్వేషించవచ్చు. వీటిలో పేటెంట్ పొందిన స్మార్ట్ గ్రిడ్ పరుపులు, స్మార్ట్ రిక్లైనర్ బెడ్‌లు, దిండ్లు, ఆఫీసు కుర్చీలు & రిక్లైనర్ సోఫాలు సహా ఎన్నో వున్నాయి. మరో రెండు అదనపు అవుట్‌లెట్‌లతో, నగరంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు కంపెనీ సిద్ధమైంది.

భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నిద్ర లేమి ప్రధాన సమస్యగా ఉంది, అనేక మంది తమ రద్దీ జీవనశైలి, సోషల్ మీడియా ఎడిక్షన్ మొదలైన వాటి కారణంగా నిద్రలేమికి గురవుతున్నారు. 2023లో ప్రచురించబడిన లాన్సెట్ అధ్యయనం, తెలంగాణలో చాలా ఎక్కువ (25% కంటే ఎక్కువ) గా సెంట్రల్ ఒబేసిటీ, రక్తపోటు కేసులు ఉన్నాయని వెల్లడించింది. నిద్ర లేకపోవడం, ఊబకాయం, రక్తపోటు పెరుగుదల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు చూపిస్తున్నాయి. ది స్లీప్ కంపెనీ వినియోగదారులందరికీ సైన్స్ ఆధారిత, వినూత్నమైన, అసాధారణమైన నాణ్యమైన నిద్ర, సౌకర్యవంతమైన పరిష్కారాలను అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది.

ది స్లీప్ కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్, విజయవాడ, గుంటూరు, తెలంగాణాలో వరంగల్ వంటి నగరాలతో సహా పలు చోట్ల తమ దుకాణాలను కలిగి ఉంది. బ్రాండ్ కు అమ్మకాల పరంగా రెండవ అత్యధిక సహకారం అందించే నగరంగా హైదరాబాద్ ఉండటంతో, ఈ అభివృద్ధి దేశంలోని దక్షిణ ప్రాంతంలో బలమైన రీతిలో కార్యకలాపాలు నిర్వహించాలనే కంపెనీ యొక్క వ్యూహాత్మక లక్ష్యానికి అనుగుణంగా ఉంది. కేవలం రెండు సంవత్సరాలలో ఆరు రెట్లు వృద్ధిని చూసినట్లుగా, ది స్లీప్ కంపెనీ కేవలం నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా దాని కార్యకలాపాలను వేగంగా విస్తరించింది. సెప్టెంబర్ 2023 నాటికి, దాని ARR రూ. 350 కోట్లకు పైగా ఉంది నవంబర్ 2021లో 60 కోట్ల నుండి గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.

ది స్లీప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్ మాట్లాడుతూ, “మా 75వ స్టోర్ ప్రారంభోత్సవం మాకు ఒక ప్రతిష్టాత్మకమైన సందర్భం. ఇది మా నిరంతర ఆవిష్కరణల ప్రయాణాన్ని ప్రతిబింబించడమే కాకుండా భారతదేశం నిద్రిస్తున్న విధానాన్ని పునర్నిర్వచించాలనే మా నిబద్ధతను సైతం ప్రతిబింబిస్తుంది. 2024 చివరి నాటికి దేశవ్యాప్తంగా 150+ స్టోర్‌లను ప్రారంభించాలని మేము ప్రణాళిక చేసాము, మా పరివర్తన నిద్ర పరిష్కారాలను దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు మరింత చేరువ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.

“మా ప్రత్యేకత ఏమిటంటే, మా స్టోర్‌లన్నీ కూడా కంపెనీ యాజమాన్య పరిధిలో , కంపెనీ-నిర్వహిస్తున్న (COCO) స్టోర్లు. తద్వారా వినియోగదారులందరికీ స్థిరమైన బ్రాండ్ అనుభవాన్ని, సర్వీస్ ఎక్సలెన్స్‌ని నిర్ధారిస్తుంది. నిద్ర యొక్క ప్రశాంత శక్తిని స్వీకరించడానికి మరియు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాలను గడపడానికి వ్యక్తులను శక్తివంతం చేయాలనే మా లక్ష్యం మారదు” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News