Sunday, April 28, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. వెంకన్న సర్వ దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 63,831 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,367 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టిటిడి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News