Saturday, July 27, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంఖ్య భారీగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇక, బుధవారం శ్రీవారిని 67,320 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 27,919 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News