Monday, June 17, 2024

తిరుమలలో రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు ఫుల్

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఆదివారం శ్రీవారిని 89,161 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 35,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News