Sunday, April 28, 2024

ఎపిలో ఘోర రైలు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయనగరంలోని కంటకానిపల్లి జంక్షన్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ ఫెయిల్ కావడంతో రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై ఎపి సిఎం జగన్మోషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి ఘటనాస్థలానికి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News