- Advertisement -
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కైతాపురం గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.
- Advertisement -