Saturday, April 20, 2024

బిజెపితోనే గిరిజన యూనివర్సిటీ మూలకు పడింది: సత్యవతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్‌టి అవాసాలన్నింటినీ గ్రామాపంచాయతీలుగా మార్చామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బుధవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. శాసన సభలో సత్యవతి మాట్లాడారు. గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్నారు. తన కూడా తండాలో పుట్టి పెరిగానని, అక్కడి సమస్యలేంటో తనకు తెలుసునన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ములుగులో 335 ఎకరాల స్థలసేకరణ జరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం చిన్నచూపు వల్లనే గిరిజన యూనివర్సిటికీ మూలకు పడిందని పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీకి స్థల సేకరణ జరిగి మూడేళ్లైనా కేంద్రం ముందుకు రావడంలేదని సత్యవతి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News