Monday, April 29, 2024

మూడో రోజు రైతుబంధుకు రూ.1325.24 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలపు పంటల సాగుకు సబంధించి మూడవరోజు రైతుబంధు కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1325.24కోట్లు విడుదల చేసింది. ఈ సందర్బంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ బుధవారం నాడు 10.89లక్షల మంది రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు జమ చేసినట్టు తెలిపారు.ఇప్పటి వరకు 50.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.3246.42 కోట్లు జమ చేజయటం జరిగిందన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయం, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. అందుకే జనాభాలో అధికశాతం ఆధారపడిన వ్యవసాయరంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News