Friday, April 26, 2024

కొలువుల కొండ

- Advertisement -
- Advertisement -

మరో 16,940 పోస్టులకు త్వరలో అనుమతులు
డిసెంబర్‌లో నోటిషిషన్లు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
ఉద్యోగ నియామకాలపై టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్, అధికారులతో సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 16,940 పోస్టులకు త్వరలోనే ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సర్వీస్ రూల్స్‌లో చేపట్టవలసిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టిఎస్‌పిఎస్‌సికి సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్‌లో నోటిఫికేషన్‌లు జారీ చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

బిఆర్‌కెఆర్ భవన్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌పై మంగళవారం టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు శాఖల్లో నియామక ప్రక్రియను సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు తదితర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా భర్తీ జరుగుతుందని సిఎస్ తెలిపారు. నియామకాల ప్రక్రియలో కచ్చితంగా సమయపాలన పాటించడంతోపాటు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సిఎస్ శాంతికుమారి, జిఎడి కార్యదర్శి శేషాద్రి, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎస్సీడీ రాహుల్ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News