Friday, May 10, 2024

నేడు నిఘా నీడలో టెట్ పరీక్ష..

- Advertisement -
- Advertisement -

నిఘా నీడలో టెట్ పరీక్ష
రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణ
హైదరాబాద్: నేడు జరిగే టెట్ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగనుంది. పరీక్ష మొత్తం 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పేపర్ 1కు 2,69,557 మంది, పేపర్ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 నిర్వహణకు 1139, పేపర్ 2కు 913 సెంటర్లు సిద్ధం చేశారు. మొత్తం 2052 కేంద్రాలకు 2052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2052 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.

నిఘా నీడలో పరీక్షలు నిర్వహించనున్నారు. పారదర్శకంగా నిర్వహించేందుకే సీసీ టీవీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. వైద్యం, రవాణాకు అబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. సెల్‌పోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News