Friday, April 19, 2024

ఎస్ఐ, ఏఎస్ఐ తుది రాత‌ప‌రీక్ష‌ల‌ తేదీలు ఖరారు..

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్: ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్ష‌ల తేదీల‌ను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు(టిఎస్ఎల్ పిఆర్ బి) ఖ‌రారు చేసింది. ఏప్రిల్ 8, 9వ తేదీల్లో ఈ రాత‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించనున్నట్లు వెల్లడించింది.హాల్ టికెట్ల‌ను ఏప్రిల్ 3వ తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి 6వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చని తెలపింది.

ఎస్‌సీటీ ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల‌కు ఏప్రిల్ 8న ఉద‌యం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పేపర్-I, మ‌ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వ‌ర‌కు పేపర్-II ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక, ఎస్‌సీటీ ఎస్ఐ(సివిల్) పోస్టుల‌కు ఏప్రిల్ 9న ఉద‌యం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పేపర్-I, మ‌ధ్యాహ్నం 2.30  గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వ‌ర‌కు పేప‌ర్-II ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News