- Advertisement -
అమరావతి: కడపలో జరిగే మహానాడుకు ఆర్టిసి బస్సులు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో ప్రైవేటు వాహనాలలో ప్రయాణం సాగించారు. కడప జిల్లాలోని పలు బస్టాండ్ లో ప్రయాణికులు గంటలు కొద్ది వేచి చూడాల్సి వచ్చింది. ప్రయాణికులతో గుత్తి బస్టాండ్ కిక్కిరిసిపోయింది. టిడిపి మహానాడుకు ఆ పార్టీ కార్యకర్తలను ప్రైవేటు వాహనాలలో తరలిస్తే బాగుండేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసి వివిధ పార్టీ మహాసభలకు ఆర్ టిసి బస్సులను కేటాయించడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
- Advertisement -