Tuesday, April 30, 2024

తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి గుడ్‌న్యూస్..

- Advertisement -
- Advertisement -

TSRTC Good News for Devotees of Tirumala

మనతెలంగాణ/హైదరాబాద్: తిరుమల వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్‌న్యూస్ తెలిపింది. తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపారు. రిటర్న్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే దర్శనం టికెట్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఆర్టీసి కల్పించింది. ఆర్టీసి తీసుకున్న నిర్ణయంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

TSRTC Good News for Devotees of Tirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News