ప్రమాదవశత్తు నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని గుండాల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, దోమ ఎస్ఐ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుండాల గ్రామానికి చెందిన గొల్ల మహేష్ (11), కుక్కలి శివతేజ్ (11) ఇద్దరు విద్యార్థులు గుండాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్నారు.
వేసవి సెలవులు కావడంతో గురువారం ఉదయం 9 గంటలకు ఇద్దరూ స్నేహితులు పొలంకు వెళ్లి వస్తామని ఇంటి దగ్గర చెప్పి వెళ్లారని ఇంటి నుంచి వెళ్లి గుండాల గ్రామ శివారులో శ్రీకాంత్ రెడ్డి అనే రైతు పొలంలో తవ్విన గుంత దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపోయి పడి చనిపోయారని ఎస్ఐ ఆనంద్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని ఎస్ఐ తెలిపారు.