Tuesday, April 30, 2024

ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు

- Advertisement -
- Advertisement -

Two DRG jawans injured in encounter at Chhattisgarh

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. కేర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిచోర్‌గూడ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో నక్సల్ దళం డీఆర్‌జీ బృందం రోడ్డు నిర్మాణ పనులకు భద్రత కల్పించేందుకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ మీడియాకు తెలిపారు. మావోయిస్టుల కంచుకోటగా భావించే చిచోర్‌గూడ, నిలవాయ గ్రామాల మధ్య ఈ రహదారిని నిర్మిస్తున్నారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిచోర్‌గుజా సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పెట్రోలింగ్ బృందం చుట్టుముట్టినప్పుడు, మావోయిస్టుల గుంపు నుండి కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల్లో డీఆర్‌జీ కానిస్టేబుల్ సోమదు ప్యామ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ మెహ్రు రామ్ కశ్యప్ గాయపడ్డారన్నారు. అప్రమత్తమైన అదనపు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News