Sunday, April 28, 2024

బాపట్ల జిల్లాలో నిమజ్జనం వేళ విషాదం…

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో గురువారం విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కృష్ణా నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో కొందరు యువకులు విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు రేపల్లె వాసులు విజయ్ (22), వెంకటేష్ (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News