Thursday, May 2, 2024

బీజేపీ ఓ విషసర్పం.. మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

చెన్నై : సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈసారి ఆయన బీజేపీని విష సర్పంతో పోల్చారు. ఆదివారం తమిళనాడు లోని నైవేలీలో డీఎంకే ఎమ్‌ఎల్‌ఎ సభా రాజేంద్రన్ ఇంట జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష అన్నాడిఎంకే పాములకు ఆశ్రయమిచ్చే పార్టీగా మారిందని అభివర్ణించారు. ఇటీవల డీఎంకే నేత మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా మాట్లాడుతూ ప్రధాని మోడీని పాముగా అభివర్ణించారు.

ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “ విష సర్పం మీ ఇంట్లోకి వస్తే … దానిని తీసి బయటపడేస్తే కుదరదు. అది మీ ఇంటి చుట్టుపక్కల చెత్తలో దాక్కొంటుంది. ఆ చెత్తను తీసేసే వరకు అది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఈ సన్నివేశంతో ప్రస్తుత పరిస్థితిని పోలిస్తే తమిళనాడు మన ఇల్లు. బీజేపీ ఓ విషసర్పం. అన్నా డిఎంకె మన ఇంటి వద్ద ఉన్న చెత్తలాంటిది. మనం చెత్తను తీసేవరకు విష సర్పం దూరం కాదు.

బీజేపీ నుంచి విముక్తి పొందాలంటే అన్నాడీఎంకేను తొలగించాలి” అని ఉదయనిధి వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన ‘సనాతన నిర్మూలన’ అనే సదస్సులో ఉదయనిధి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని, పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News