Friday, April 26, 2024

రష్యా సేనలను అడ్డుకుంటున్న ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

Vladimir Putin

ఉక్రెయిన్:  జపోరిజ్జియాలోని నివాస భవనాలపైకి గురువారం తెల్లవారుజామున ఏడు రష్యన్ రాకెట్లు దూసుకెళ్లాయి, ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌కు సమీపంలో ఉన్న నగరంలో కనీసం ఐదుగురు చిక్కుకున్నారని ఎక్కువగా రష్యా ఆక్రమిత ప్రాంతం గవర్నర్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటున్నట్లు డిక్రీపై సంతకం చేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. యుద్ధం ప్రారంభంలో రష్యా బలగాలు ఆక్రమించుకున్న ప్లాంట్‌ను కొనసాగించనున్నట్లు రాష్ట్ర అణు ఆపరేటర్ తెలిపారు.

ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం బుధవారం మాట్లాడుతూ, తాజా రష్యా షెల్లింగ్‌లో కనీసం ఐదుగురు పౌరులు మరణించారని మరియు ఎనిమిది మంది గాయపడ్డారని ఓ వార్తా సంస్థ నివేదించింది. కైవ్ ప్రాంతంలోని బిలా సెర్క్వా పట్టణంపై దాడి చేసేందుకు రష్యా సైనికులు ఆరు ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్‌లను ఉపయోగించారని, ఒక వ్యక్తి గాయపడ్డారని బుధవారం ఒక ప్రకటన పేర్కొంది.

ఇదిలావుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జెలెన్స్కీతో మాట్లాడారు, ఉక్రెయిన్ సంఘర్షణకు సైనిక పరిష్కారం సరికాదని , అదే సమయంలో అణు కేంద్రాల ప్రమాదం విపత్తు పరిణామాలను కలిగిస్తుందని నొక్కి చెప్పారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సార్వభౌమాధికారానికి భారతదేశం మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోడీకి  జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు,  ఉక్రెయిన్ వ్లాదిమిర్ పుతిన్‌తో ఎటువంటి చర్చలు జరపదని నొక్కిచెప్పారు. పైగా రష్యా సేనలను ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ధీటుగా ఎదుర్కొంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News