Wednesday, May 8, 2024

నాణ్యమైన విద్యపై మోడీని ప్రశ్నించిన యునెస్కో చీఫ్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మన్‌కీ బాత్ కార్యక్రమం 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఈ వందో ఎపిసోడ్‌ను భారత్‌లోని వివిధ భాషలతో సహా 11 విదేశీభాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. ఈ నేపథ్యంలో యునెస్కో చీఫ్ ఆండ్రీ అజౌలే ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మోడీని పలు ప్రశ్నలు అడిగారు. 2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న యునెస్కో లక్షం గురించి అజౌలే మోడీతో మాట్లాడారు. ఈ లక్షాన్ని చేరుకోవడంలో భారత్ అనుసరించే మార్గం ఏమిటని మోడీని అడిగారు. అందుకు మోడీ సమాధానమిస్తూ..విద్యను అందించడంలో నిస్వార్థంగా పని చేసిన వారి పేర్లను గుర్తు చేసుకున్నారు.

ఒడిశాకు చెందిన దివంగత డి. ప్రకాశరావును గుర్తు తెచ్చుకుంటూ.. ఆయన గీ అమ్మే వాడని, నిరుపేద పిల్లలను చదివించడమే అతని జీవిత లక్షమని ప్రధాని అన్నారు. అలాగే జార్ఖండ్ గ్రామాల్లో డిజిల్ లైబ్రరీలను నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్, కొవిడ్19 సమయంలో ఇలెర్నింగ్ ద్వారా పిల్లలకు సహాయం చేసిన ఎన్ హేమలత గురించి మోడీ మాట్లాడారు. ఇంకా అజౌలే ఈ ఏడాది భారత్ నేతృత్వంలోని జి20 శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ అజెండాలో దేశ సంస్కృతి, విద్యను మోడీ ఎలా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లబోతున్నారనే దాని గురించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక పరిరక్షణ, విద్య రెండూ ఇష్టమైన అంశాలుగా నిలిచాయి. అది లక్షద్వీప్‌లోని కుమ్మెల్ బ్రదర్స్ క్లబ్ లేదా కర్నాటక కావెశ్రీకీ కళా చేతన్ మంచ్ కూడా కావచ్చు అని అన్నారు. అలాగే దేశం నలుమూలలనుంచి ప్రజలు లేఖల ద్వారా అలాంటి వాటిగురించి తెలియజేశారు. అందులో మేము రంగోలి, దేశభక్తిగీతాలు, లాలిపాటలు కంజోజ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమం వలే ్లవిభిన్న ప్రపంచ సంస్కృతిని సుసంపన్నం చేయాలనే సంకల్పం బలపడిందని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News