Saturday, April 27, 2024

అరుణాచల్ భారత్‌దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ బుధవారం వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంట చేసే ఆక్రమణ యత్నాలను తిప్పికొడుతున్నట్టు స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌పై గత కొన్నేళ్లుగా చైనా మొండి వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని ఇటీవల ఆ దేశ రక్షణశాఖ అధికార ప్రతినిధి
సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ అసంబద్ధ వాదనలకు దిగారు. దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. నిరాధార వాదనల ద్వారా వాస్తవాలు మారిపోవని స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News