వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ తరుఫున ఆడిన ఇతను.. ఈ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్గా అందరి మన్ననలు పొందాడు. ఐపిఎల్లో ఆడేందకు ఎక్కువగా అవకాశాలు రాకపోయినా వచ్చిన ఒకటి, రెండు ఛాన్స్లలో తన సత్తా చూపించాడు. దీంతో వైభవ్కి (Vaibhav Suryavanshi) అవకాశాలు క్యూ కడుతున్నాయి. విషయానికొస్తే.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో వభవ్ 90 బంతుల్లో 190 పరుగులు చేశాడు వైభవ్.
14 ఏళ్ల వయస్సులోనే అతను ఆడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారీ షాట్లు, ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడటం చూసి భారత క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు. భారత క్రికెట్లో వైభవ్ పెను సంచలనమిన కొనియాడుతున్నారు. కాగా, వైభవ్ త్వరలో ఇంగ్లండ్లో పర్యటించబోయే భారత అండర్-19 జట్టుకు ఎంపిక అయ్యాడు. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ అండర్-19 జట్టులో ఓ 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, 2 మల్టీ డే మ్యాచ్లు ఆడనుంది.