Tuesday, May 7, 2024

రాముడు కాదప్పా…. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు…

- Advertisement -
- Advertisement -

Vaishnav Tej's New Movie Pooja Ceremony

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న చిత్రం బుధవారం ఉదయం ముహూర్తం జరుపుకుంది. హైదారాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభమైంది. సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్, హీరో సాయిధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దర్శకులు సుధీర్ వర్మ, కళ్యాణ్‌లు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. క్లాప్ హీరో సాయిధర్మ తేజ్ ఇవ్వగా, కెమెరా స్విచాన్ దర్శకుడు సుధీర్ వర్మ చేశారు. స్క్రిప్ట్‌ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌కు అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. ‘రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్.

అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా…’ అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరికగా అంటే… ‘ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా…. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు… సూస్కుందాం రా…. తలలు కోసి సేతికిస్తా నాయాలా…!’ అంటూ కథానాయకుడు హెచ్చరించడం కనిపిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తాడు. శ్రీ లీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయమవుతున్నారు. పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ చిత్రమని అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య.

Vaishnav Tej’s New Movie Pooja Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News