Wednesday, May 1, 2024

యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి

- Advertisement -
- Advertisement -

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈనెల 15న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాత దేవరాజ్‌కు నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. సినిమాను కేవలం 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అంత త్వరగా పూర్తి చేయటానికి కారణం ప్రీ ప్రొడక్షన్స్ ఎక్కువగా పని చేయటమే.

దర్శకుడిగా ‘వెయ్ దరువెయ్’ తొలి చిత్రమే అయినప్పటికీ ఎలాంటి ప్రెషర్ ఫీల్ కాలేదు. అందుకు కారణం నిర్మాత దేవరాజ్, హీరో సాయిరామ్ శంకర్. సహా మొత్తం సినిమా టీమ్ అందించిన సపోర్ట్ అనే చెప్పాలి. సాయిరామ్ శంకర్ను హీరోగా అనుకుని పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో కలిశాం. నాకతనైతేనే నా కథలోని హీరోగా సూట్ అవుతారనిపించింది. ఇక కథ విషయానికి వస్తే కామారెడ్డి ప్రాంతంలో ఉండే హీరోకి ఓ సమస్య వస్తుంది. దాని పరిష్కారానికి హీరో ఏం చేశాడు.. ఎందుకు హైదరాబాద్ వచ్చాడు.. సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడనేదే మా సినిమా ప్రధాన కథాంశం.

సినిమా చిన్న సెంటిమెంట్తో ప్రారంభం అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కొన్ని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాం. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్‌గా సినిమాను రూపొందించాం. యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మెయిన్ హైలైట్. మేం అనుకున్న పాయింట్ సీరియస్‌గా చెప్పొ చ్చు. కానీ నేను ఎంటర్టైనింగ్‌గానే చెప్పాలనుకున్నాను. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. హీరోయిన్స్ యషా శివకుమార్, హెబ్బా పటేల్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. కథలో భాగంగా వారి పాత్రలు ప్రయాణిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News