Sunday, April 28, 2024

డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” చిత్రాన్ని ప్రకటించిన విష్ణు మంచు

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్ర ని ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు, ఈరోజు ‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీ కాళహస్తి లో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారు.

అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు మంచు. తన తండ్రి లెజెండరీ నటుడు, నిర్మాత శ్రీ మోహన్ బాబు గారు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తారు. కృతి సనాన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన హీరోయిన్ గా నటిస్తారు. అలాగే లెజెండరీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ గారు, బుర్ర సాయి మాధవ్ గారు మరియు తోట ప్రసాద్ గారు ఈ చిత్ర కథ కి కీలక మెలికలు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమా భక్త కన్నప్ప.  అతని భక్తి యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తాం అని విష్ణు అన్నారు.

త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అని అన్నారు. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి టాప్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తామని విష్ణు మంచు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News