Friday, May 3, 2024

ఇది రాహుల్, మోడీ మధ్య యుద్ధం: అజిత్ పవార్

- Advertisement -
- Advertisement -

బానామతి: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య సంగ్రామమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పుణె జిల్లాలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్‌సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కన్హేరీలోని హనుమాన్ ఆలయంలో శనివారం పూజలు నిర్వహించిన అనంతరం ఆమె అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అజిత్ పవార్‌తోపాటు ఆయన కుమారులు పునీత్, జై, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సునేత్రకు ప్రత్యర్థిగా అజిత్ పవరా సోదరి, శరద్ పవార్ కుమార్తె, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన సుప్రియా సూలె పోటీ చేస్తున్నారు. ఎన్‌సిపి(శరద్ పవార్) తరఫున పోటీ చేస్తున్న సుప్రియ, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సిపి తరఫున పోటీ చేస్తున్న సునేత్ర గురువారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ముందు జాగ్రత్తగా అజిత్ పవార్ కూడా ఈ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ ప్రసంగిస్తూ ఈ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, ఇవి ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. కాగా..హనుమాన్ ఆలయం నుంచే సుప్రియా సూలె కూడా తన తండ్రి శరద్ పవార్ , ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం విశేషం. బారామతిలో మే 7న పోలింగ్ జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News