- వరల్డ్ నో టొబాకో కాన్ఫరెన్స్లో వక్తల కితాబు
హైదరాబాద్: ధూమపానం ఎంతో మంది జీవితాల్ని చిద్రం చేస్తోంది అనే ఆవేదన, ఎంతో మంది యువత తెలిసో.. తెలియకో స్మోకింగ్కు అలవాటు అవుతున్నారు అనే కసి, వెరసి ఓ సాదా సీదా ఉద్యోగిని.. వాట్ ఈస్ దిస్.. కెన్నాట్ వి స్టాప్ ఇట్ (మనం దీన్ని ఆపలేమా?!) అని ప్రపంచ పొగాకు వ్యతిరేక సదస్సులో ప్రశ్నించే లా చేసింది. సార్ ఎట్ లిస్ట్ లెట్ అస్ కంట్రోల్ ఇట్ (ఇక నైనా నియంత్రించే ప్రయత్నం చేద్దాం సార్) అని ప్రార్థించేలా చేసింది. ఓ వ్యక్తి సమాజ హిత కాంక్ష, తపన.. ప్రపంచ పొగాకు వ్యతిరేక వేదిక సైతం ‘వావ్.. మాచన రఘునందన్ (Machana Raghunandan)..వాట్ ఏ అమేజింగ్ ఇండియన్’ అని కొనియాడేలా చేసింది. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్ జెనీవాలో మే 29న వరల్డ్ నో టొబాకో కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే సభ్యులతో ఆదివారం రాత్రి వేబినార్ నిర్వహించారు.
మే 29న జరిగే ప్రపంచ పొగాకు వ్యతిరేక సదస్సులో ఏయే అంశాలు చర్చించాలి అనే విషయంపై కూలంకుషంగా చర్చించారు. ఈ క్రమంలోనే మాచన రఘునందన్ తెలంగాణలో 5 ఏళ్లలో ఐదు వేల కిలో మీటర్లు ప్రయాణిస్తూ.. 500 గ్రామాల్లో దాదాపు యాభై వేల మందికి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్ధాలను వివరించడంలో చేసిన అసాధారణ కృషిని పొగాకు నియంత్రణ సంస్థలు, నిపుణులు శ్లాఘించారు. ఈ మేరకు రఘునందన్ (Machana Raghunandan) సోమవారం నాడు మాట్లాడుతూ.. మే 29న జరిగే సదస్సులో ఆన్లైన్లో పాల్గొననున్నట్టు చెప్పారు.