Sunday, May 5, 2024

నేనేం తప్పు చేశాను… నన్ను ఎందుకు పక్కన పెట్టారు? : విహెచ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు పక్కన పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ప్రశ్నించారు. ఎంపిగా పోటీ చేసి తీరుతానని, తన మనసులో మాట చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నానని, ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని స్పష్టం చేశారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ తనను అడుగుతున్నారన్నారు. పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారా? అని ప్రశ్నించారు.

సిఎం రేవంత్ రెడ్డి పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్ అడిగితే తన లాంటి సీనియర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. లాస్ట్ టైం కూడా తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. మోడీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్ వెళ్లడానికి టైం లేదని విమర్శించారు. ఏం ఉద్దరించారని ఆయన విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బిజెపి ప్రయత్నిస్తోందని వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు, గుడులు మీ అయ్య జాగీర్లా? అని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News