Thursday, April 18, 2024

భర్తతో కాపురం చేస్తానని భార్య పోరాటం…

- Advertisement -
- Advertisement -

Wife strike for husband in Warangal

హైదరాబాద్: తన భర్తతో కాపురం చేయాలని ఓ భార్య పోరాటం చేస్తున్న సంఘటన వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగింది. హన్మకొండ ప్రాంతం యాదవ్‌నగర్‌కు చెందిన హేమంత్‌తో 2015 మార్చి 31న అనూషకు పెళ్లి జరిగింది. హేమంత్‌కు రూ.20 లక్షల నగదుతో పాటు 50 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. బెంగళూరు హేమంత్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆ దంపతులకు కుమారుడు సాత్విక్ పుట్టినప్పంటి నుంచి ఆమెను హేమంత్ దూరంగా పెట్టాడు. అత్తింటి వారి చెప్పుడు మాటలతో ఆమెను హేమంత్ కాపురానికి తీసుకరావడంలేదని ఆరోపణలు చేసింది. కోర్టు ద్వారా పోరాటం చేస్తూనే ఉంది. కోర్టు అనుమతితో బాబుకు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించగా హేమంత్ వారుసుడే అని తేలింది. కోర్టు తీర్పును తన భర్తం లేక్క చేయడంలేదని ఆమె వాపోయింది. మూడు రోజులుగా భర్త ఇంటి ముందుట ధర్నాకు దిగింది. న్యాయ పోరాటం చేస్తున్న అనూషకు మహిళ సంఘాలతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News