Saturday, July 27, 2024

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. నేడు మద్యం షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మద్యం షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, కల్లుదుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను బంద్ చేయాలని పోలీస్ కమిషనర్లు శ్రీనివాస రెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్‌జోషి ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఇచ్చారు.

ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు తెలిపారు.  నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా మద్యం షాపులు బంద్ చేయాలని ఆదేశించిన అధికారులు… నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News