Wednesday, April 24, 2024

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి డీకొట్టింది. ఈ ఘటన జిల్లాలోని కోహిర్ మండల చింతలఘాట్ సమీపంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగింది.గోవా నుంచి హైదరాబాద్ కు వళ్తున్న సమయంలో లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. దీంతో కారులో ఉన్న యువతి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన యువతి మృతదేహాన్ని బయటికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువతిని కూకట్ పల్లికి చెందని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నిహారికగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Woman Died in Road Accident in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News