Saturday, April 27, 2024

నారీ శకం

- Advertisement -
- Advertisement -

మహిళా బిల్లును ఆమోదించిన రాజ్యసభ

ఇక చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

న్యూఢిల్లీ: చట్టసభలలో మహిళలకు 33శాతం కోటా కల్పించే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ లో బిల్లుకు ఆమోదం దక్కడంతో ఇక చట్టసభలలో ‘ ఆమె’ కొత్త కథకు, నయాసిల్‌సిలాకు జరిగింది. దాదాపు పది గంటలకు పైగా సుదీర్ఘ చర్చ తరువాత గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఓటింగ్ జరిగింది. ప్రతి సభ్యుడి వద్ద ఉన్న మల్టీ మీడియా డివైజ్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. పద్ధతిలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్‌లో మొత్తానికి మొత్తం 215 ఓట్లు అనుకూలంగా పడ్డాయి. ఓటు ఒక్కటి పడలే దు . దీనితో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం దక్కింది. రాజ్యసభ అధ్యక్షుడు , ఉప జగదీప్ ధన్‌కర్ ఆధ్వర్యంలో ని ర్వహించారు. పార్లమెంట్ ఆమోదం పొందుతోన్న ఈ బిల్లు దేశ మహిళ శక్తి ని మరింత ద్విగుణీకృతం చేస్తుందని ప్రధాని మోడీ తమ ప్రసంగంలో తెలిపారు.

ఈ బిల్లుపై జరిగిన చర్చ లో ఉభయసభలకు చెందిన 132 మంది సభ్యులు పాల్గొన్నారని , ఇది కొత్త పార్లమెంట్‌కు గర్వకారణం అని మోడీ తెలిపారు. ఈ చర్చల దశలో వ్యక్తమైన ప్రతి అంశానికి రాబోయే చరిత్రలో విలువ ఉంటుందన్నారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ బిల్లు ఆమోదం పొం దడం పట్ల వెంటనే స్పందించారు. ఇది అపూర్వ ఘట్టం అని పేర్కొన్నారు. బిల్లును ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం దక్కడంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపిస్తారు. అంతకుముందు మ హిళా బిల్లును కేంద్రప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఒక్కరోజు క్రితం బుధవారం ఈ బిల్లు చారిత్రక రీతిలో లోక్‌సభలో ఆమోదం పొందింది. చట్టసభలలో మూడింట ఒక వంతు మహిళా కోటా సంబంధిత బిల్లు దేశంలోని మహిళల సాధికారత దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పరంపరలో భా గం అని బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ న్యాయశాఖ మంత్రి తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ముందు కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ దశలో న్యాయమంత్రి మోడీ నాయకత్వపు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా పలు కోణాలలో మహిళ అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చిందని, చ ట్టసభలలో సముచిత స్థానం ఈ దిశలో శిఖరాయమానం అవుతుందని వివరించారు. ఈ దశలో ఆయన జన్‌ధన్ జీరో ఖాతా ల ప్రారంభం, లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛభారత్, మహిళల ఆత్మగౌరవ దిశలో పలు చర్యలు తీసుకున్నట్లు తె లిపారు. ప్రధాన మంత్రి ముద్రయోజన (పిఎంఎంవై) పరిధిలో లబ్థిదారులలో 68 శాతం వరకూ మహిళలే ఉన్నారని లెక్కలు చెప్పారు. లోక్‌సభ , రాష్ట్రాల విధానసభలలో మహిళలకు 33 శాతం కోటా కల్పన బహుముఖమైనదని ఇందులోనే ఎస్‌సి/ ఎస్‌టి కేటగిరి కూడా ఉంటుందని వివరించారు.

అంతకు ముందు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ మా ట్లాడుతూ సాధారణంగా ఏదైనా బిల్లు తేవడానికి రెండు రోజుల ముందస్తు నోటీసు అవసరం ఉం టుందన్నారు. అయితే లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన మరుసటిరోజే రాజ్యసభలో నూ ఇది ఆమోదం పొందేందుకు వీలుగా ఈ రెండు రోజుల నో టీసు నిబంధననుతాను ఎత్తివేసినట్లు వివరించారు. మ హిళకు 33 శాతం కోటా ఉండాల్సిందేనని ఎగువసభలో వివిధ పార్టీల సభ్యులు స్పష్టం చేశారు. అయితే ఇన్ని నాళ్ల తరువాత కేంద్రం ఇప్పుడు ఆదరబాదరాగా ఈ బిల్లును తీసుకువచ్చింద ని, ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు, జంతర్‌మంతర్ అని కొన్ని విపక్షాలు విమర్శించాయి. బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే ఓటుకు మహిళల సీట్లకు లింక్‌లు పెట్టడం అనుచితం అని విమర్శించారు. బిల్లు తేవడం సరే, అమలు ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సభ్యులు స్పష్టం చేశారు. సిపిఎంకు చెం దిన ఎలమరం కరీం స్పందిస్తూ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఉం దన్నారు. బిజెపి ఈ బిల్లును 2014లో, తరువాత 2019లోనే ఈ బిల్లును ఎన్నికల మాటగా చెప్పిందని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని ఇప్పటికీ ఈ బిల్లు తెచ్చారని, ఈ విధంగా బిల్లు కార్యరూపంలోకి రాకుండా తొమ్మిదేళ్లు కాలాయాపన చేసిన పార్టీ బిజెపినే అని విమర్శించారు. కొన్ని రాష్ట్రాలలో , ఢిల్లీ స్థానిక ఎన్నికలలో అపజయంతో చేపట్టిన ఎన్నికల స్టంటు అని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి మహిళల గురించి పట్టించుకునే తీరిక లేదన్నారు.

2011 లెక్కలనే లెక్కలోకి తీసుకోండి : కెకె
మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ల కోటాను తమ పార్టీ స్వాగతిస్తుందని బిఆర్‌ఎస్ ఎంపి, సీనియర్ నేత కె కేశవరావు తెలిపారు. చర్చలో ఆయన పాల్గొంటూ లోసుగుల లేకుండా చే స్తేనే బిల్లుకు సార్థకత ఏర్పడుతుందన్నారు. బిల్లు వాస్తవికతను దాల్చి, చట్టం రూపంలోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయా ల్సి ఉందని చెప్పారు. డిలిమిటేషన్, జనాభా లెక్కల పేరిట కో టా అమలును జాప్యం చేయరాదని డిమాండ్ చేశారు. బిల్లు లో మహిళా బిసిల ఉపకోటా ఉండాలనేది తాము మొదటి నుంచి చెపుతున్నామని వివరించారు. ఎప్పుడో ప్రక్రియలు పూ ర్తి చేసి మహిళా కోటాను తీసుకురావడం వల్ల ఆలస్యం మరిం త ఆలస్యం అవుతుందని చెప్పారు. 2011 సెన్సస్‌ను కొలమానంగా తీసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. దీని వల్ల తిరిగి నిర్ణీత జనాభాగణన వరకూ వేచి ఉండాల్సిన పని ఉండదన్నారు. లోపాలను తరువాత సవరించుకోవచ్చునని , ముందు కోటా ఫలాలు మహిళలకు అందాల్సి ఉందన్నారు. స త్వరమే సంబంధిత డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కావల్సి ఉందని, ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల త్వరితగతిన అడ్డంకులు తొలిగిపోతాయన్నారు. ఎండిఎంకెకు చెందిన వైగో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకునే బిల్లు తెచ్చారని జెడియు ఎంపి రాంనాథ్ అన్నారు.

ఈ బిల్లును తాను తెచ్చిన వేళ జ్ఞాపకాలలో దేవెగౌడ
జెడిఎస్ నేత హెచ్‌డి దేవెగౌడ స్పందిస్తూ తాను ప్రధానిగా ఉ న్నప్పుడు తొలుత ఈ బిల్లును తీసుకువచ్చిన విషయాన్ని అప్ప టి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.మహిళా బిల్లు తన చిరకాలపు కల అని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి దీనిపై స్పందిస్తూ వచ్చానని, యునైటెడ్ ఫ్రంట్ హయాంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడు దీనిపై కసరత్తు చేసి బిల్లును సభలోకి వచ్చేలా చేశానని అప్పటి విషయాలను సభలో గర్తు చేసుకున్నారు. ఒబిసిలకు కూడా బిల్లు వర్తింపచేసేందుకు వీలుగా దీనిని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి స్పం ది స్తూ మహిళా కోటా రాజ్యసభ, రాష్ట్రాల కౌన్సిళ్లకు కూడా వర్తించాలని కోరారు. వెంటనే కోటా అందుబాటులోకి వస్తేనే న్యా యం దక్కుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ సూచించారు.ఒబిసి మహిళకుసబ్ కోటా ఉండాల్సిందేన్నారు. మరోవైపు మహిళా బిల్లుకు ఆమోదం లభించగానే రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News