Saturday, April 20, 2024

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని నిత్యపూజలో భక్తులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో జరుగు నిత్యపూజలలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారులను దర్శించుకున్నారు. బుధవారము ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదార్శన నారసింహ హోమం పూజలతో భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో జరిగిన నిత్యకల్యాణం, పుష్పార్చన, వేండి జోడి సేవలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. శ్రీవారి కొండపైన కొలువు దీరిన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని, కొండ కింద శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారి నిత్యరాబడి..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడి బుధవారము రోజున 15,01,780 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో జరుగు అర్జిత సేవలు, ప్రసాద విక్రయం, ప్రధాన బూకింగ్, పాతగుట్ట ఆలయం, కొండపైకి వాహనాల అనుమతి ఇతర శాఖల నుండి శ్రీ వారి నిత్యరబాడి సమకురినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News