Saturday, May 4, 2024

ఫిర్యాదు చేసినా స్పందనలేకపోవడంతో పామును వదిలాడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోవడంతో వారి కార్యాలయంలోకి ఓ యువకుడు పామును వదిలాడు. ఈ ఘటన నగరంలోని అల్వాల్ లో చోటుచేసుకుంది. అల్వాల్ లో కురిసిన భారీ వర్షానికి సంపత్ కుమార్ అనే యువకుడి నివాసముంటున్న ఇంట్లోకి వరద నీటితోపాటు పాము కూడా వచ్చింది.

దీంతో ఆ యువకుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా అధికారులు రాకపోవడంతో సదరు యువకుడు.. పామును పట్టుకుని వెళ్లి అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసులో వదిలి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News