Monday, August 18, 2025

ఈతకు వెళ్లి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివ్వంపేట గ్రామ శివారులోని మంజీరా నదిలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు వారి బంధువుల ఊరు అయిన జోగిపేటకు వచ్చి వెళుతున్న తరుణంలో శనివారం సాయంత్రం మార్గమధ్యలో శివ్వంపేట దాటిన తర్వాత మంజీరా నదిలో స్నానానికి వెళ్లి అందులో ఐదు మంది స్నేహితులు కలిసి స్నానం చేశారు. అమీన్ బాబా వయసు 20 అనుకోకుండా కాలుజారి మంజీరా నదిలో పడి చనిపోయారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News