Sunday, April 28, 2024

ప్రేయసి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జైపూర్ : వారిద్దరు చిన్నప్పటి నుండి ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఊహించని విధంగా ప్రేయసి మరణించడం ఆ మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డ సంఘటన శెట్టిపల్లిలో విషాదం నింపింది. జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సాయితరుణ్ (22) ఇదే గ్రామానికి చెందిన జ్యోతిక ఇద్దరు ప్రేమించుకోగా కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించడకపోవడంతో వారిని ఎదురించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు.

జ్యోతిక గర్బిణి కావడం రక్తహీనత వ్యాదితో నెల కిందట ఆసుపత్రిలో జ్యోతిక మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయి తరుణ్ వారం రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నస్పూర్ మున్సిపాలిటీకి పరిధిలోని సీసీసీలో నివాసం ఉంటుండగా మృతదేహాన్ని స్వగ్రామమైన శెట్టిపల్లికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News