Friday, July 11, 2025

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14మంది మృతి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బద్జహార్ ఘాట్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడి 14మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News