Thursday, March 28, 2024

వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : వనపర్తి జిల్లా మదర్ తెరిసా జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అందరికి స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జాతీయ రహదారి Nh44 రోడ్డుపై జరిగింది. కొత్తకోట బైపాస్ సమీపంలో యాదగిరి గుట్టకు చెందిన ఆర్టీసి బస్సు TS30Z0015గా గుర్తించారు. అదుపు తప్పి బోల్తాపడిన బస్సు యాదగిరిగుట్ట నుంచి తిరుపతి వెళుతుండగా ఘటన జరిగిందని బాధితులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కొత్తకోట ఎస్ఐ అతని బృందం ప్రమాదస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News